సూపర్ సిక్స్ పథకాలు వివరించాలి
ABN, Publish Date - Apr 19 , 2024 | 01:26 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలుచేసే సూపర్సిక్స్ పథకాలు గురించి ప్రజలకు వివరించాలని కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు.
కె.గంగవరం, ఏప్రిల్ 18: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలుచేసే సూపర్సిక్స్ పథకాలు గురించి ప్రజలకు వివరించాలని కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గురువారం తామరపల్లిలో టీడీపీ సీనియర్ నాయ కుడు నెక్కంటి బాలకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థి వాసం శెట్టి సుభాష్ మాట్లాడుతూ ఈనెల22న నానిమనేషన్ వేస్తు న్నానని, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సైకిల్గుర్తుకు రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా హరీష్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రేవు శ్రీను, కట్టా నాగేశ్వరరావు, సలాది శ్రీను, మరివాడ చిన్నికృష్ణ, మేడిశెట్టి రవికుమార్, సలాది రమేష్, శీరెడ్డి సత్తిబాబు, చొల్లంగి ఎదుర్లయ్య, జనసేన నాయకులు దేవరపల్లి చక్రి, తాడాల జానకిరామ్, బిజేపి నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Apr 19 , 2024 | 01:26 AM