స్వల్పకాలిక వంగడాలతో మళ్లీ సాగుకు సిద్ధంకండి
ABN, Publish Date - Jul 24 , 2024 | 01:33 AM
వర్షాలకు నీట మునిగి దెబ్బతిన్న సార్వా పొలాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ పీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం మంగళవారం పరిశీలించింది.
ఉప్పలగుప్తం, జూలై 23: వర్షాలకు నీట మునిగి దెబ్బతిన్న సార్వా పొలాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ పీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం మంగళవారం పరిశీలించింది. గొల్లవిల్లిలో ముంపులో సార్వా నాట్లు దెబ్బతిన్న పరిస్థితిని రైతులు అరిగెల నానాజీ, అడబాల సత్యనారాయణ వివరించారు. నష్టాన్ని పూడ్చుకోవడానికి స్వల్పకాలిక వంగడాలతో తిరిగి సార్వా సాగు చేసుకోవాలని డైరెక్టర్ సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 85వేల ఎకరాల్లో వరినాట్లు వేశారని జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు తెలిపారు. వరి నాట్లు ముంపులో ఉన్నాయని, పూర్తిగా దెబ్బతినలేదని వ్యాఖ్యానించారు.
Updated Date - Jul 24 , 2024 | 01:33 AM