నేడు అనితరుడు పుస్తక పరిచయసభ
ABN, Publish Date - Jul 14 , 2024 | 11:59 PM
పోర్టుసిటీ (కాకినాడ), జూలై 14: సహృదయ సాహితీ సంస్థ, పీఆర్ ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో అనితరుడు అనే పుస్తక పరిచయ సభ నిర్వహి స్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పీఆర్ కళాశాల ఎల్సీడీ హాల్ డాక్టర్ అవంత్స సోమసుందర్ ప్రాంగణంలో ము
పోర్టుసిటీ (కాకినాడ), జూలై 14: సహృదయ సాహితీ సంస్థ, పీఆర్ ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో అనితరుడు అనే పుస్తక పరిచయ సభ నిర్వహి స్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పీఆర్ కళాశాల ఎల్సీడీ హాల్ డాక్టర్ అవంత్స సోమసుందర్ ప్రాంగణంలో మువ్వా శ్రీనివాసరావు రచించిన అనితరుడు కవితాంతరంగ విశ్లేషణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీ తిరుపాణ్యం హాజరవుతారని, డాక్టర్ వేదుల శ్రీరామశర్మ(శిరీష) అధ్యక్షత వహిస్తారని, ముఖ్యవక్తగా డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథులుగా జేఎన్టీయూకే డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎస్వీజీ మురళీకృష్ణ, తెలుగు, సంస్కృత శాఖాధిపతి డాక్టర్ వై.బుజ్జి హాజరవుతారని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కవులు, సాహితీవేత్తలు విచ్చేస్తారని పేర్కొన్నారు.
Updated Date - Jul 14 , 2024 | 11:59 PM