కౌంటింగ్ కేంద్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా
ABN, Publish Date - May 26 , 2024 | 01:56 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వున్న కౌంటింగ్ కేంద్రాలకు ఓట్లు లెక్కించే సమయంలో మూడు రోజుల పాటు నిరంతర విద్యుత్ సరఫరా వుండే విధంగా చర్యలు తీసుకొంటున్నామని ఎస్ఈ ఎం.కృష్ణారెడ్డి తెలిపారు.
తిరుపతి (ఆటోనగర్),మే 25 : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వున్న కౌంటింగ్ కేంద్రాలకు ఓట్లు లెక్కించే సమయంలో మూడు రోజుల పాటు నిరంతర విద్యుత్ సరఫరా వుండే విధంగా చర్యలు తీసుకొంటున్నామని ఎస్ఈ ఎం.కృష్ణారెడ్డి తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనంగా జనరేటర్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిత్తూరు సమీపం ముత్తిరేవుల వద్ద వున్న ఎస్వీసెట్ కళాశాల వద్ద కూడా వున్న విద్యుత్ వసతులతో పాటు జనరేటర్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Updated Date - May 26 , 2024 | 08:08 AM