ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వాణియంబాడి సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌

ABN, Publish Date - Apr 15 , 2024 | 02:12 AM

తమిళనాడు రాష్ట్రం వాణియంబాడి సమీపంలో గూడ్స్‌ రైలు ఆదివారం రాత్రి పట్టాలు తప్పింది. దీంత కుప్పం మీదుగా బెంగళూరు వెళ్లే పలు రైళ్లు ఆలస్యమయ్యాయి.

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

ఫ కుప్పం మీదుగా బెంగళూరు వెళ్లే రైళ్లు ఆలస్యం

కుప్పం, ఏప్రిల్‌ 14: తమిళనాడు రాష్ట్రం వాణియంబాడి సమీపంలో గూడ్స్‌ రైలు ఆదివారం రాత్రి పట్టాలు తప్పింది. దీంత కుప్పం మీదుగా బెంగళూరు వెళ్లే పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. తిరుపతినుంచి కుప్పం మీదుగా బెంగళూరు వెళ్లే ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ వాణియంబాడిలో ఆగిపోయింది. అలాగే చెన్నై నుంచి కుప్పం మీదుగా బెంగళూరు వెళ్లే లాల్‌బాగ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును వలతూర్‌ రైల్వే స్టేషన్‌లో అధికారులు ఆపేశారు. దీంతో కుప్పం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు రాత్రి వేళ తీవ్ర అవస్థలు పడ్డారు. రైళ్లకోసం ఎదురుతెన్నులు చూస్తూ స్టేషన్‌లోనే కాలం గడిపారు. కాగా రైల్వే అధికారులు వాణియంబాడి వద్ద పట్టాలు తప్పిన రైలుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.

Updated Date - Apr 15 , 2024 | 02:12 AM

Advertising
Advertising