ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 12,927మంది హాజరు
ABN, Publish Date - May 26 , 2024 | 02:01 AM
జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 12,927 మంది విద్యార్థులు హాజరయ్యారు.
తిరుపతి(విద్య), మే 25: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 12,927 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 13,660 మంది దరఖాస్తు చేసుకోగా 733 మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షలకు 12,590 మంది జనరల్కిగాను 11,964 మంది, 456 మంది ఒకేషనల్కిగాను 422మంది పరీక్షలు రాశారు. 626 మంది జనరల్, 34 మంది ఒకేషనల్ మొత్తం 660 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 492 మంది జనరల్కిగాను 426 మంది, 122 మంది ఒకేషనల్కిగాను 115 మంది మొత్తం 541 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 66 మంది జనరల్, ఏడుగురు ఒకేషనల్ మొత్తం 73 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
Updated Date - May 26 , 2024 | 07:38 AM