రెండు నామినేషన్లు తిరస్కరణ
ABN, Publish Date - Apr 26 , 2024 | 11:14 PM
ఆలూరు అసెంబ్లీ స్థానానికి 25 మంది అభ్యర్థులు ్ఞ్ఞనామినేషన్లు వేశారు.
ఆలూరు, ఏప్రిల్ 26: ఆలూరు అసెంబ్లీ స్థానానికి 25 మంది అభ్యర్థులు ్ఞ్ఞనామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన చెపట్టారు. అందులో టీడీపీ నుంచి రెండు సెట్లు నామినేషన్ వేసిన గిరి మల్లేష్ గౌడ్ బీ-ఫారం సమర్పించలేదనే కారణంతో తిరస్కరణకు గురైంది. అలాగే వైసీపీ నుంచి బూసినే రామాంజమ్మ రెండు సెట్లు నామినేషన్లు వేశారు. ఆమె కూడా బీ ఫారం సమర్పించలేదనే కారణంతో నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు ఆలూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామునాయక్ తెలిపారు. మొత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, రెండు తిరస్కరణకు గురి అవ్వడంతో 13 మంది నామినేషన్లు ఆమోదం పొందినట్లు తెలిపారు. పరిశీలనలో టీడీపీ, వైసీపీ, బీసీవై, బీఎస్పీ, జై భారత్ నేషనల్ పార్టీల అభ్యర్థులు వీరభద్ర గౌడ్, విరుపాక్షి, మోహన్ ప్రసాద్, రామలింగ, షేక్షా వలి, స్వతంత్ర పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు.
Updated Date - Apr 26 , 2024 | 11:14 PM