రెండెకరాలు పందెం కాసిన వ్యక్తిపై బైండోవర్ కేసు
ABN, Publish Date - Jun 01 , 2024 | 11:55 PM
మండలంలోని వగరూరు గ్రామానికి చెందిన బోయ బుజ్జల చిన్నోడు తనకున్న రెండెకరాలు (సుమారు రూ.50 లక్షలు) విలువ చేసే పొలాన్ని పందేనికి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో బైండోవర్ కేసు నమోదు చేసినట్లు మంత్రాలయం ఎస్ఐ గోపినాథ్ తెలిపారు.
మంత్రాలయం, జూన్ 1: మండలంలోని వగరూరు గ్రామానికి చెందిన బోయ బుజ్జల చిన్నోడు తనకున్న రెండెకరాలు (సుమారు రూ.50 లక్షలు) విలువ చేసే పొలాన్ని పందేనికి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో బైండోవర్ కేసు నమోదు చేసినట్లు మంత్రాలయం ఎస్ఐ గోపినాథ్ తెలిపారు. శుక్రవారం బోయ బుజ్జల చిన్నోడు సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్లలో టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి గెలుపు ఖాయమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని రెండెకరాల పొలాన్ని పందేం కాశాడు. దీంతో అతనితో పాటు సహకరించిన బోయ తిక్కన్న, బోయ ఈరన్నలపై బైండోవర్ కేసులు నమోదు చేసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ముందస్తు అరెస్టులు చేస్తామని ఎస్ఐ గోపినాథ్ తెలిపారు.
Updated Date - Jun 01 , 2024 | 11:55 PM