రావమ్మా..గంగమ్మా..!
ABN, Publish Date - Aug 21 , 2024 | 11:54 PM
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. గోరంట్లలో మంగళవారం 35మి.మీ. బుధవారం 25మి.మీ.వర్షపాత నమోదయ్యింది. స్థానిక పెద్ద చెరువుకు నీటి ప్రవాహం మొదలయ్యింది.
రావమ్మా..గంగమ్మా..!
గోరంట్ల, ఆగస్టు 21: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. గోరంట్లలో మంగళవారం 35మి.మీ. బుధవారం 25మి.మీ.వర్షపాత నమోదయ్యింది. స్థానిక పెద్ద చెరువుకు నీటి ప్రవాహం మొదలయ్యింది. దీంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. రెండు నెలలుగా బోర్లు ఎండిపోయి పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా మారిందని, చెరువు నీటితో సమస్య తీరనుందని హర్షం వ్యక్తం చేశారు. పాలసముద్రం చెరువుకు గంగ పూజ నిర్వహించారు.
హిందూపురం(పరిగి): ఎగువ కురిసిన భారీ వర్షాలకు చెరువులు జలకళ సంతరించుకుంటున్నాయి. కర్ణాటక నుంచి జయమంగళి నది పొంగి పొర్లడంతో బుధవారం పరిగి చెరువుకు నీరు చేరింది. తహసీల్దార్ హసీనాసుల్తానా శీరంగరాజులపల్లి నదిలో బుధవారం గంగపూజ నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, మారుతిప్రసాద్, డీఎ్సఎల్ శ్రీనివాసులు, ప్రవీణ్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, పాల్గొన్నారు.
Updated Date - Aug 21 , 2024 | 11:54 PM