ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీసీ కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తాం

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:29 AM

కొత్తచెరువు, ఏప్రిల్‌ 15: మండల కేంద్రంలోని బీసీకాలనీకి మౌలిక వసతులు కల్పిస్తామని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లెసింధూరారెడ్డి పేర్కొన్నారు.

కొత్తచెరువు, ఏప్రిల్‌ 15: మండల కేంద్రంలోని బీసీకాలనీకి మౌలిక వసతులు కల్పిస్తామని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లెసింధూరారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని బీసీ కాలనీలో సోమవారం సాయంత్రం ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమపథకాల గురించి వివరించారు. అనంతరం కాలనీ వాసులు తమ కాలనీలో డ్రైనేజీలు, సీసీరోడ్లు, విద్యుత స్తం భాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులుపడుతున్నామని ఆమె దృష్టికి తెచ్చారు. డ్రైనేజీలేక లేక వర్షాకాలం వస్తే వర్షపు నీరు ఇళ్లలోకి వస్తోందని వాపోయారు. ఇందుకు పల్లె సింధూర మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పూర్తిగా విస్మరించిందన్నారు. సీఎం జగన ఐదేళ్లకాలంలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సైతం ప్రజల బాగోగులను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అలాంటి సీఎం, అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి పాటు పడే చంద్రబాబును సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 12:29 AM

Advertising
Advertising