ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ycp: వైసీపీ అభ్యర్థి నామినేషనకు జనం కరువు

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:55 AM

ధర్మవరం, ఏప్రిల్‌ 24:ధర్మవరం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం నామినేషనదాఖలు చేశారు. అయితే నామినేషనకు అనుకున్న స్థాయిలో జనం రాలేదు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

నామినేషన ర్యాలీలో స్వల్పంగా ఉన్న వైసీపీ శ్రేణులు

- డబ్బులిచ్చినా ఆశించినస్థాయిలో రాని వైనం

ధర్మవరం, ఏప్రిల్‌ 24:ధర్మవరం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బుధవారం నామినేషనదాఖలు చేశారు. అయితే నామినేషనకు అనుకున్న స్థాయిలో జనం రాలేదు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.


కేతిరెడ్డి తిక్కస్వామినగర్‌లోని శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 8-30గంటలకే ర్యాలీగా తరలివచ్చారు. అయితే జనం అనుకున్నంత మేర రాకపోవడంతో శ్రేణులపై తమ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 2019లో నామినేషనకు వచ్చిన అభిమానులతో బేరీజు చేసుకుంటే ఈ ఏడాది ఎన్నికల నామినేషనకు జనం రాక భారీగా తగ్గిపోయినట్టు ఆ పార్టీ వర్గాలే బాహాటంగా వ్యక్తం చేశారు. అభ్యర్థి నామినేషన వేయడానికి ఆర్డీఓకార్యాలయంలోకి వెళ్లగానే వచ్చిన కాస్తా జనం కూడా జారుకున్నారు. దీంతో ఖాళీ రోడ్డు దర్శనమిచ్చింది .ఒక్కొక్కరికి రూ.500 డబ్బులిచ్చి పిలిపించుకున్నా.. చివరి వరకు జనాలు ఎందుకు ఉండనివ్వలేదంటూ ఆ ప్రజాప్రతినిధి శ్రేణులపై ఆగ్రహం వ్యక్త చేసినట్లు సమాచారం.


మరిన్ని వార్తల కోసం...


Updated Date - Apr 25 , 2024 | 12:55 AM

Advertising
Advertising