Home » Politics
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏప్రియల్ 19న తొలివిడత పోలింగ్ జరగనుంది. ఏడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేశాయి. ముందుకు ప్రజలను ఆకర్షించేందుకు మేనిఫెస్టోలతో రెడీ అయ్యాయి.
దేశం మొత్తం ఓట్ల పండుగ జరుగుతోంది. రాజకీయ నాయకులంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎక్కడ ఓటరుంటే అక్కడ నాయకులు వాలిపోతున్నారు. ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనే లెక్కలు తీస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు రోజులు అవుతుంది. ఇప్పటివరకు నిందితులు ఎవరో తెలియలేదు. అనుమానితుల పేరుతో కొందర్ని విచారిస్తున్నారు. సీఎం అంటే జడ్ ప్లస్ భద్రత.. ముఖ్యమంత్రి (CM) చుట్టూ పోలీసులు.. ఆయన పర్యటిస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ముందే తమ అధీనంలోకి తీసుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో భవనాలను క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేస్తారు. బయట వ్యక్తులు సీఎంపై దాడి చేయడం అసాధ్యం. ఒకవేళ ఎవరైనా ఆకతాయిలు రాయి విసిరితే అది గాయం చేసేలా తగిలే అవకాశాలు చాలా తక్కువ. గత రెండు రోజుల్లో..
ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) వివాదంలో మరో కొత్త కోణం. కంపెనీ ఏర్పాటైన మూడేళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే అర్హత లభిస్తుదని నిర్దేశిత చట్టం స్పష్టం చేస్తున్నప్పటికీ.. పలు కంపెనీలు ఆ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించాయి. పార్టీలకు(Political Parties) విరాళాలు సమర్పించుకున్నాయి.
రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Comission) షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసే హోర్డింగ్స్ విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించింది.
గడిచిన పదేళ్ల పాలనలో అభివృద్ధిపై ఆకలి మాత్రమే పుట్టించామని, మెయిన్ కోర్స్ ముందుందని ప్రధాని మోదీ తెలిపారు.
ఉమ్మడి శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో 10 అసెంబ్లీ నియో జకవర్గాలు ఉండగా.. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక నియోజకవర్గం ఆముదాలవలస. పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, ఆముదాలవలస మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 10 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఐదుసార్లు టీడీపీ అభ్యర్థులు గెలిచారు. నాలుగు సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్లో ఎన్డీయే కూటమి విజయపరంపరకు బ్రేక్ వేసేందుకు సమాజ్వాదీ పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇండియా కూటమిలో భాగ స్వామిగా ఉన్న ఎస్పీ, కాంగ్రెస్, టీఎంసీ కలిసి యూపీలో పోటీ చేస్తున్నారు.
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాలకు ఇంచార్జ్లను ప్రకటించింది. మొత్తం 17 నియోజకవర్గాలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఇంచార్జ్లను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. టీడీపీ (TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిగా పోటీ చేస్తున్నాయి. వైసీపీ(YCP) ఒంటరిగా 175 సీట్లలో పోటీ చేస్తుంది.