POLLING : ప్రశాంతంగా తొలివిడత ఎన్నికలు
ABN, Publish Date - Apr 27 , 2024 | 01:02 AM
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన తొలివిడత పార్లమెంటు ఎన్నికలు పావగడలో ప్రశాంతంగా జరిగాయి. తాలూకా వ్యాప్తంగా 246 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు తహసీల్దార్ సంతోష్కువమార్ ఏర్పాట్లు పూర్తి చేశారు. తాలూకాలో 1,97,458 ఓటర్లు ఉండగా 1,46,456 ఓట్లు పోలయ్యి 74 శాతం పోలింగ్ జరిగినట్లు తహసీల్దార్ తెలి యజేశారు.
పావగడ, ఏప్రిల్ 26: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం జరిగిన తొలివిడత పార్లమెంటు ఎన్నికలు పావగడలో ప్రశాంతంగా జరిగాయి. తాలూకా వ్యాప్తంగా 246 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహణకు తహసీల్దార్ సంతోష్కువమార్ ఏర్పాట్లు పూర్తి చేశారు.
తాలూకాలో 1,97,458 ఓటర్లు ఉండగా 1,46,456 ఓట్లు పోలయ్యి 74 శాతం పోలింగ్ జరిగినట్లు తహసీల్దార్ తెలి యజేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా సహకరించినందుకు తాలూకా లోని ఓటర్లకు తహసీల్దార్ కృతజ్ఞతలు తెలియజేశారు. హనుమంతనహళ్లిలో ఎమ్మెల్యే హెచవీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణప్ప, కేటీ హళ్లిలో మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప, పావగడలో బీజేపీ సీనియర్ నేత ప్రముఖ వైద్యులు డాక్టర్ జే వెంకటరామయ్య, డాక్టర్ శశికిరణ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Apr 27 , 2024 | 01:02 AM