ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల వేళ ఏరులై పారుతున్న కర్ణాటక మద్యం

ABN, Publish Date - Apr 24 , 2024 | 11:57 PM

ఎన్నికలు వస్తే చాలు గతంలో కర్ణాటక ప్రాంతం నుంచి కుప్పలు తెప్పలుగా సారా ప్యాకె ట్లు తెచ్చి ఓటర్లకు పంచేవారు. అక్కడ సారా ప్యాకెట్‌ ఒక్కోటి రూ. 5లు నుంచి రూ. 7లు వరకు ఉండేది.

karnataka liquor

అప్పుడు సారా.. ఇప్పుడు టెట్రా

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌ 24: ఎన్నికలు వస్తే చాలు గతంలో కర్ణాటక ప్రాంతం నుంచి కుప్పలు తెప్పలుగా సారా ప్యాకె ట్లు తెచ్చి ఓటర్లకు పంచేవారు. అక్కడ సారా ప్యాకెట్‌ ఒక్కోటి రూ. 5లు నుంచి రూ. 7లు వరకు ఉండేది. అందుకే ఓ టింగ్‌కు కొన్ని రోజుల ముందుగానే అభ్యర్థులు వాటిని తెప్పించి డంప్‌ చేసుకునేవారు. పోలింగ్‌ ముందు రోజు, లేదా పోలింగ్‌ రోజు వాటిని ఓటర్లకు పంచేవారు. ఈక్రమంలో ఆంధ్రా ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయంటే కర్ణాటకలో మద్యానికి మంచి డిమాండ్‌ ఉండేది. సరిహద్దు ప్రాంతాలైన పెద్దపల్లి, కొత్తకోట, పావగడ, టుంకూరుకు వెళ్లి ముందుగానే సారా ప్యాకెట్లు తెప్పించేవారు. అయితే మన రాష్ట్రంలో సారాను నిషేధించడంతో వాటి స్థానంలో ప్రస్తుతం టెట్రా ప్యాకెట్లు వస్తున్నాయి. కర్ణాటక నుంచి ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గాలకు కుప్పలు తెప్పలుగా టెట్రా ప్యాకెట్లు తెప్పించుకుంటున్నారు. ఇక్కడి మద్యం ధరల కంటే కర్ణాటక టెట్రా ప్యాకెట్ల ధరలు తక్కువగా ఉండటమే డిమాండ్‌కు ప్రధాన కారణం. ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాల్లో టెట్రా ప్యాకెట్లు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది.

Updated Date - Apr 24 , 2024 | 11:57 PM

Advertising
Advertising