బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ
ABN, Publish Date - Apr 18 , 2024 | 12:16 AM
మండలంలోని ముచ్చుకోటలో బు ధవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించా రు.
పెద్దపప్పూరు, ఏప్రిల్ 17: మండలంలోని ముచ్చుకోటలో బు ధవారం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించా రు. కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి హాజరయ్యా రు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటువేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తాతిరెడ్డి లోకనాథ్రెడ్డి, జేసీ శశిధర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ గుర్తి రఘునాయుడు, భాస్కర్రెడ్డి, విష్ణువర్దనరెడ్డి, పెద్దిరెడ్డి, ప్రతా్పరెడ్డి, వెంకటశివారెడ్డి పాల్గొన్నారు.
టీడీపీ నాయకులను కలిసిన జేసీ పవనరెడ్డి
తాడిపత్రిటౌన: టీడీపీకి చెందిన సీనియర్ నాయకులను బుధవారం జేసీ పవనరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని గానుగవీధిలో ఉంటున్న సూర్యముని, పుట్లూరురోడ్డులోని జగదీశ్వరరెడ్డి, ప్రశాంతినగర్లో ఉంటున్న ఎంఏ రంగారెడ్డి ఇళ్లకు పవనరెడ్డి స్వయంగా వెళ్లారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు మీ వంతు సహకారం అందించాలని కోరారు. ఆయన వెంట నాయకులు పవనకుమార్రెడ్డి, హరినాథ్రెడ్డి, సుదర్శనరెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.
Updated Date - Apr 18 , 2024 | 12:16 AM