ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

election: పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: ఆర్వో

ABN, Publish Date - May 12 , 2024 | 12:35 AM

నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో ఈనెల 13 వ తేదీన నిర్వహించే ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటశివరామిరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ధర్మవరం, మే 11: నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో ఈనెల 13 వ తేదీన నిర్వహించే ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటశివరామిరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.


13వ తేదీన పోలింగ్‌ బూతలలో కూర్చునే ఏజెంట్లు నియామకంలో ఫారం-10ని భర్తీ చేసి తగిన సంతకాలతో నేరుగా ఆయా పోలింగ్‌ బూతల పీఓలకు వెంటనే చేర్చాలన్నారు. నియోజకవర్గంలో 290 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మార్కెట్‌యార్డ్‌లో పీఓ, ఏపీఓలకు ఆదివారం పోలీసుబందోబస్తు నడుమ ఎన్నికల సామగ్రిని అందజేస్తామన్నారు. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ఉంటుందన్నారు. కావున ప్రతి ఓటరు ఓటు హక్కును తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆర్వో తెలిపారు.

Updated Date - May 12 , 2024 | 12:35 AM

Advertising
Advertising