25 lambs died 25 గొర్రెపిల్లలు మృతి
ABN, Publish Date - Jul 28 , 2024 | 11:45 PM
మండలంలోని దుద్దేకుంటలో ఆదివారం గొర్రెపిల్లలు అకస్మాత్తుగా మృతిచెందాయి. వివరాల్లోకెళ్తే.. యజమానులు హనుమంతప్ప, యర్రి స్వామి, రమేష్ 25 గొర్రె పిల్లల్ని ఉదయం జాలరీ ఉన్న దొడ్లో వదిలివెళ్లారు.
బెళుగుప్ప, జూలై 28 : మండలంలోని దుద్దేకుంటలో ఆదివారం గొర్రెపిల్లలు అకస్మాత్తుగా మృతిచెందాయి. వివరాల్లోకెళ్తే.. యజమానులు హనుమంతప్ప, యర్రి స్వామి, రమేష్ 25 గొర్రె పిల్లల్ని ఉదయం జాలరీ ఉన్న దొడ్లో వదిలివెళ్లారు.
తర్వాత సాయంత్రం వచ్చి చూడగా అన్నీ చనిపోయి పడిఉన్నాయి. ఎందుకు మృతి చెందా యో అంతుచిక్కడం లేదని యజమానులు వాపోయారు. రూ. లక్షకు పైగా నష్టపోయామని ఆవేదన చెందారు. ఈ విషయమై పశువైద్యాధికారి రమేష్ మాట్లా డుతూ పోస్టుమార్టమ్ నిర్వహిస్తే ఎందుకు చనిపోయాయో తెలుస్తుందని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Jul 28 , 2024 | 11:45 PM