ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayashanti: ఆ విషయంలో.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటే..

ABN, First Publish Date - 2023-11-25T10:22:21+05:30

అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పంపించాలని,

అడ్డగుట్ట/తిరుమలగిరి(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పంపించాలని, లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు అరెస్ట్‌ చేయలేదో బీజేపీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ నాయకురాలు, సినీనటి విజయశాంతి(Movie actress Vijayashanti) డిమాండ్‌ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌(BJP, BRS) రెండూ ఒక్కటేనని ఆమె అన్నారు. సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆదం సంతోష్ కుమార్‌, వెన్నెలకు మద్దతుగా శుక్రవారం విజయశాంతి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ అభ్యర్థి ఆదం సంతోష్‌ కుమార్‌ అడ్డగుట్ట డివిజన్‌లోని తుకారాంగేట్‌ పరిధిలో నిర్వహించిన రోడ్‌షోలో విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కై, కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి యత్నిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా అడ్డగుట్ట ఓటర్లతో కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని ఆమె ప్రతిజ్ఞ చేయించారు. కంటోన్మెంట్‌లో ప్రచారం చేస్తూ హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్‌ అభ్యర్థి వెన్నెలను గెలిపించాలని కోరారు.

Updated Date - 2023-11-25T10:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising