ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghunandan Rao: పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారు

ABN, First Publish Date - 2023-10-13T16:45:52+05:30

సిద్దిపేట జిల్లా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు( Raghunandan Rao) అన్నారు.

దుబ్బాక: సిద్దిపేట జిల్లా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు( Raghunandan Rao) అన్నారు. శుక్రవారం నాడు దుబ్బాకలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘నేను అధికార పార్టీ నేతలపై ఫిర్యాదు చేస్తే... BRS నేతల ద్వారా బీజేపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టె కుట్ర చేస్తున్నారు. నేను రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. BRS నేతల ద్వారా మాపై ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెడుతున్నారు. సిద్దిపేట సీపీ శ్వేత, ఏసీపీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. అవినీతి కేసులో ఉన్న మంత్రి హరీశ్‌రావు ఓఎస్డీ AY గిరి ఎన్నికల ఉల్లాంగణలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ వాహనంలో వచ్చి డబ్బులను ఓఎస్డీ పంచుతున్నారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్‌లో కల్యాణలక్ష్మి చెక్ లు పంచుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన నలుగురు అధికారులపై ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశాం. ఉపఎన్నికల్లో నన్ను ఎంత టార్చర్ చేశారో అందరికీ తెలుసు’’ అని రఘునందన్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-13T16:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising