ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Rao : శశిధర్ రెడ్డి చేరికతో మెదక్‌లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం

ABN, First Publish Date - 2023-10-13T11:27:33+05:30

పాపన్నపేట మండలం యూసుఫ్ పేట గ్రామానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డికి బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆహ్వానించారు.

మెదక్ : పాపన్నపేట మండలం యూసుఫ్ పేట గ్రామానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డికి బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. మొన్న తిరుపతి రెడ్డి చేరిక నేడు శశిధర్ రెడ్డి చేరికతో మెదక్‌లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమన్నారు. కొందరు డబ్బు సంచులతో వస్తున్నారన్నారు. మెదక్ ఆత్మ గౌరవాన్ని డబ్బులతో కొనలేరన్నారు. ఎన్నికల పండుగకు రకరకాల వ్యక్తులు వస్తున్నారని హరీష్ రావు అన్నారు.

వ్యవసాయం దండగ అన్న దానిని సీఎం కేసీఆర్ పండగ చేశారని అన్నారు. కాంగ్రెస్ ఉచిత కరెంట్‌ను ఉత్తి కరెంట్ చేశారని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతుల పంట ఎండుతుండేదని.. నేడు పంట పండుతోందన్నారు. కాంగ్రెస్ హయాంలో కరువులు, కర్ఫ్యూలు ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. తెలంగాణలో మరోమారు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మూడు పంటల వైపు ఉంటారా..మూడు గంటల కరెంట్ వైపు ఉంటారా రైతులు ఆలోచించుకోవాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Updated Date - 2023-10-13T11:27:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising