Home » Thanneeru Harish Rao
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రేవంత్రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని విమర్శలు చేశారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులను విమర్శించడమే సరిపోతోందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. నీటి వాటా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర పోతుందా.. నిద్ర పోతున్నట్లు నటిస్తుందా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీశ్రావు దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ బతుకుతోందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యావరేజ్గా 20రోజుల పాటు మాత్రమే సభను నడిపారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ ఏడాది 16రోజులు మాత్రమే సభను నడిపారని ప్రస్తావించారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది క్రిస్టియన్లు క్రిస్మస్ పండగను చేసుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఏసుప్రభువు ఎంతో మంచి సందేశాన్ని ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు.
ఒక నెలలోపు పెండింగులో ఉన్న పదవులు అన్నీ భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్ఫష్టం చేశారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి అపూర్వ ఆదరణ వస్తోందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సర్పంచ్లను కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఈ రెండేళ్లలో అసెంబ్లీ నిర్వాహణలో చోటుచేసుకున్న తీవ్రమైన వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలపై ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ శాఖలో తెలంగాణ ప్రాంత అధికారులను నియమించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై అఖిలపక్షం సమావేశం పెట్టాలని సూచించారు. కమీషన్ల కోసమే కొత్త విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తున్నారని ఆరోపణలు చేశారు.
కేసీఆర్ హయాంలో దసరా పండుగకు చీరలు ఇస్తే సీఎం రేవంత్రెడ్డి మాత్రం ఓట్లకు చీరలు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. మహిళలకు ఇచ్చిన చీరలు యూనిఫామ్ చీరల్లాగా ఉన్నాయని విమర్శించారు. కేసీఆర్ పలు రంగుల చీరలు ఇచ్చారని... కోటి 30 లక్షల చీరలను ప్రతి బతుకమ్మకు కేసీఆర్ హయాంలో ఇచ్చామని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రం కోసం మాజీ సీఎం కేసీఆర్ పోరాడారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కేసీఆర్ పోరాటం గురించి మూర్ఖంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.