Home » Thanneeru Harish Rao
రైతన్నల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేటఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రుణమాఫీ చారణా చేసి.. బారనా ఎగ్గొట్టిందని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఉద్యమ నేపథ్యాన్ని, రాజకీయ ప్రయాణాన్ని, భవిష్యత్తు ఆశయాలను ప్రతిబింబించాయని వారు తెలిపారు. ఒకవైపు ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ, మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విమర్శలు చేశారు. ఈ పోస్టులు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఒక కీలక కేసులో భారత రాష్ట్ర సమితి అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులకు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. 2011లో జరిగిన 'మిలీనియం మార్చ్' సందర్భంగా నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భతమని కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రముఖ తెలంగాణ కవి, రచయిత నందిని సిధారెడ్డి గొప్ప పాత్ర పోషించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వ్యాఖ్యానించారు. సిధారెడ్డికి అవార్డు రావడం అంటే అవార్డుకే విలువ పెరిగిందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పేదల ఇళ్లు కూలగొడుతున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి పేదల బతుకులు, ఇళ్లు కూల్చడానికి హైడ్రా తెచ్చారని ధ్వజమెత్తారు.
పంట కొనుగోలు చేయకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి కాదు ఆయన బాంబులేటి.. పొగరులేటి అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయాంలోని పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎప్పటికీ బీఆర్ఎస్ ఒడిపోదని తమ మామ ముఖ్యమంత్రిగా ఉంటారని మాజీ మంత్రి హరీశ్రావు కలలు కన్నారని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.