MLA Madhusudan Reddy: రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలి
ABN, Publish Date - Dec 18 , 2023 | 10:16 PM
కోయిల్ సాగర్ ప్రాజెక్టు ( Koil Sagar Project ) కిందా రబీలో రైతులకు నీరందించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ( MLA Madhusudan Reddy ) ఆదేశించారు. సోమవారం నాడు ఐఏబీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
మహబూబ్నగర్: కోయిల్ సాగర్ ప్రాజెక్టు ( Koil Sagar Project ) కిందా రబీలో రైతులకు నీరందించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ( MLA Madhusudan Reddy ) ఆదేశించారు. సోమవారం నాడు ఐఏబీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ...‘‘జూరాల నుంచి కోయిల్ సాగర్కు ఒక టీఎంసీ నీటిని తరలించాలని కోరాం. జనవరి నుంచి వారబంది పద్ధతిలో ఆయకట్టుకు నీరంచాలని రైతులు కోరారు ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. రైతులు నీరు గురించి ఆందోళన పడకుండా పంటలు పండించుకోవాలి’’ అని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు.
Updated Date - Dec 18 , 2023 | 10:17 PM