ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nama Nageswara Rao : బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందే

ABN, First Publish Date - 2023-04-25T12:36:21+05:30

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చి మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నేడు జరిగిన బీఆర్ఎస్ సభలో అయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలన చేస్తోందన్నారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు. బీజేపీ కుట్రలను ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొందు దొందేనన్నారు. పార్లమెంట్‌లో ఏనాడైనా తెలంగాణ కోసం ఈ నేతలు మాట్లాడారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎటువంటి అభివృద్ది చేస్తున్నారో చెప్పగలరా? అని నిలదీశారు. తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని... తెలంగాణ అభివృద్ధి చూసి పక్కరాష్ట్రాల ప్రజలు అక్కడి నేతలను నిలదీస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలంతా ఐక్యంగా పనిచేసి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్దానాలు గెలుపొందాలని నామా పేర్కొన్నారు.

Updated Date - 2023-04-25T12:36:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising