ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

JP Nadda: బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ : జేపీ నడ్డా

ABN, First Publish Date - 2023-11-19T14:36:45+05:30

బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) విమర్శించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) విమర్శించారు. ఇవాళ హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. "ప్రత్యేక రాష్ట్ర ఫలితాలు ప్రజలకు అందలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌(CM KCR) కుటుంబానికే లబ్ధి జరిగింది. ఈనెల 30న కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి. వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించేవి. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మోదీ అధికంగా నిధులు కేటాయించారు. కుటుంబ పాలనను అంతమొందించాలి.

ధరణి పోర్టల్‌ ద్వారా కేసీఆర్ పేదల భూములు దోచుకున్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారింది. ఆయన అవినీతి వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తాం. మియాపూర్‌ భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగింది. దళితబంధులో BRS ఎమ్మెల్యేలకు 3 శాతం కమీషన్‌ ఇవ్వాల్సి వస్తోంది. 3 శాతం కమీషన్ తీసుకునే ప్రభుత్వాన్ని సాగనంపాలి" అని కోరారు.

Updated Date - 2023-11-19T14:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising