MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-08-29T14:00:53+05:30
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. తన ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వెళ్లేది లేదని తెలంగాణను హిందూ రాష్ట్రంగా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు.
హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చచ్చినా సెక్యులర్ పార్టీలకు వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. తన ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వెళ్లేది లేదని తెలంగాణను హిందూ రాష్ట్రంగా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. ఒకవేళ బీజేపీ తనకు టికెట్ ఇవ్వకుంటే..రాజకీయాలు పక్కన పెట్టి నేను హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటానన్నారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉందని..అందుకే పెండింగ్ పెట్టారన్నారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారన్నారు. బీజేపీ నుంచి టికెట్ రాకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను కానీ..ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీల నుంచి పోటీ చేయబోనని రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం తనపై సానుకూలంగా ఉందని.. సరైన సమయం చూసి తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని రాజాసింగ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-08-29T14:00:53+05:30 IST