ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jayasudha : కిషన్‌రెడ్డిని కలిసిన జయసుధ.. బీజేపీలో చేరుతున్నారా?

ABN, First Publish Date - 2023-07-29T09:50:28+05:30

త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టాయి. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రముఖ సినీ నటి జయసుధ కలవడం తీవ్ర కలకలం రేపింది. జయసుధ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్ : త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్‌కు పదును పెట్టాయి. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రముఖ సినీ నటి జయసుధ కలవడం తీవ్ర కలకలం రేపింది. జయసుధ బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ విజయం సాధించారు. అయితే గతంలో కూడా జయసుధ బీజేపీలో చేరుతారంటూ హడావుడి నడిచింది ఆ తరువాత ఏమైందో ఏమో కానీ అంతా సైలెంట్ అయిపోయింది.

గతంలో కూడా జయసుధ, ఉత్తర తెలంగాణకు చెందిన ఒక సినీ నిర్మాతతో బీజేపీ చేరికల కమిటీ సభ్యులు మంతనాలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు వివరించాయి. జయసుధ 2009లో సికింద్రాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీలో చేరాలన్న ఆ పార్టీ నేతల ప్రతిపాదనపై అప్పట్లో జయసుధ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని కమలం వర్గాలు పేర్కొన్నాయి. తనకు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి విస్పష్ట హామీ ఇవ్వాలని ఆమె కోరినట్లు అప్పట్లో టాక్ నడిచింది.

Updated Date - 2023-07-29T09:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising