ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఫైళ్లు మాయం ఘటనలో.. నాంపల్లి పోలీసుల ఎదుట తలసాని ఓఎస్‌డీ ప్రత్యక్షం

ABN, Publish Date - Dec 19 , 2023 | 11:37 AM

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Former minister Talasani Srinivas Yadav) ఓఎస్‌డీ కల్యాణ్‌ ఎట్టకేలకు నాంపల్లి పోలీసుల ఎదుట

మంగళ్‌హాట్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(Former minister Talasani Srinivas Yadav) ఓఎస్‌డీ కల్యాణ్‌ ఎట్టకేలకు నాంపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ నెల 9న పశుసంవర్ధక శాఖలో ఫైళ్లు మాయమైన ఘటనలో ఆయనపై నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. నాటి నుంచి కల్యాణ్‌ కనిపించకుండా పోయినట్లు పోలీసులు చెబుతూ వస్తున్నారు. ముందస్తు బెయిల్‌ కోసం కల్యాణ్‌ కోర్టును ఆశ్రయించారు. విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు ఆదేశించడంతో ఆయన సోమవారం నాంపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు. రాత్రి 9 గంటల వరకు కూడా నాంపల్లి పోలీసులు(Nampally Police) కల్యాణ్‌ నుంచి వివరాలు రాబడుతున్నామని, విచారణ సాగుతోందని చెప్పారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులు వివరాలు వెల్లడిస్తారని వారు పేర్కొన్నారు. కాగా విచారణలో భాగంగా కల్యాణ్‌ కీలకమైన సమాచారాన్ని పోలీసులు తెలిపినట్లు సమాచారం.

Updated Date - Dec 19 , 2023 | 11:37 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising