ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TRS MLAs poaching case: కేసులో ఎంటర్ అయిన సీబీఐ

ABN, First Publish Date - 2023-01-05T19:51:37+05:30

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు(TRS MLAs poaching case)లో సీబీఐ ఎంటరైంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.

TRS MLAs poaching case
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు(TRS MLAs poaching case)లో సీబీఐ ఎంటరైంది. ఇప్పటికే హైకోర్టు సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ సీబీఐ చేతికి అందింది. ఇప్పటికే సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించడంతో ఏక్షణమైనా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. మరోవైపు కేసును సీబీఐకి బదిలీ చేసిన సింగిల్ బెంచ్ ఆర్డర్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని దుష్యంత్ దవే కోరగా శుక్రవారం నాటి విచారణ ఇంకా ఉందని ధర్మాసనం పేర్కొంది. స్టే పై ఏలాంటి నిర్ణయం ప్రకటించలేదు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్‌‌ను హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. క్రైం నెంబర్ 455/2022 ఆధారంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనుంది. మరోవైపు సింగిల్ బెంచ్ ఆర్డర్ కాపీని సీబీఐ న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ మరికాసేపట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది.

ఇటీవలే ఈ కేసులో (TRS MLAs poaching case) హైకోర్టు ఆర్డర్‌ కాపీ బయటకు వచ్చింది. 26 కేసుల జడ్జిమెంట్లను కోట్‌ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కేసు సీబీఐకి (CBI) ఇవ్వడానికి 45 అంశాలను హైకోర్టు ప్రస్తావించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) ప్రెస్‌మీట్‌ను కూడా హైకోర్టు ఆర్డర్‌లో చేర్చింది. సిట్‌ ఉనికిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థ తన పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్‌ చేశారని హైకోర్టు మండిపడింది. కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్‌ విఫలమైందని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. దర్యాప్తు సమాచారం కేసీఆర్‌కు చేరవేతపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్‌ దర్యాప్తు సక్రమంగా జరిగినట్లు అనిపించట్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సిట్‌ చేసిన దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు ధర్మాసనం ఎఫ్‌ఐఆర్‌ 455/2022ను సీబీఐకి బదిలీ చేసింది.

టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ (BL Santhosh), తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గతంలో సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజక్ట్ చేసింది. ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది. సిట్ రివిజన్ పిటిషన్‌ను కొట్టేయడంతో ఈ కేసులో కేసీఆర్ సర్కారుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చినట్లైంది.

హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులతో ఆరుగురు సభ్యులుగా సిట్ ఏర్పాటైంది. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, శంషాబాద్‌ డీసీపీ జగదేశ్వర్‌రెడ్డి, మొయినాబాద్‌ సీఐ లక్ష్మిరెడ్డిలను సిట్‌ సభ్యులుగా ఎంపిక చేశారు.

Updated Date - 2023-01-05T21:47:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising