Home » TRS
తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత భూపోరాట పిలుపుతో పోలీసుల అరెస్టులు కొనసాగుతున్నాయి.
దేశంలో ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) జరిగిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. బోధన్ నియోజకవర్గంలో ఏడాదిలో 7 వేల ఓట్లు తీసేశారని.. ఈ విషయంపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జులై 2వ తేదీన జరిగే భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ స్థానికత విషయంలో మళ్లీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
మాజీమంత్రి కేటీఆర్పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ సిరిసిల్లాకు వీకెండ్లో వచ్చి వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు.
తరుగు, రవాణా పేరుతో రైతుల వద్ద నుంచి రూ.1200 కోట్లు కప్పం కట్టించుకున్న సిగ్గు లేని ప్రభుత్వం ఇదంటూ రేవంత్ రెడ్డి సర్కార్పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కవిత కొత్త రాజకీయ పార్టీ ‘టీఆర్ఎస్’ పేరుపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ పేరును కేటాయించవద్దంటూ ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించగా, తాజాగా మహారాష్ట్రకు చెందిన మరో సంస్థ కూడా అదే వాదన వినిపించింది.
జహీరాబాద్లో బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించారని.. కానీ డీపీఆర్లో బుల్లెట్ ట్రైన్ ఎందుకు లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆగస్టు 6వ తేదీన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నాటికి ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు.
సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం రేవంత్రెడ్డి సర్కార్ విఫలమైందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెంట్రింగ్ కార్మికులకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.
కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ‘TRS’ పేరుతో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కోసం బహిరంగ ప్రకటన వెలువడటం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ కలిసి ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.