BJP leader: తన మనసులో మాట చెప్పేసిన బీజేపీ నేత.. పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా..
ABN, Publish Date - Dec 29 , 2023 | 01:07 PM
పార్టీ ఆదేశిస్తే తాను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella) పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర బీజేపీ నాయకులు సుదర్శన్ ప్రసాద్ తివారీ(Sudarshan Prasad Tiwari) పేర్కొన్నారు.
అఫ్జల్గంజ్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): పార్టీ ఆదేశిస్తే తాను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella) పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర బీజేపీ నాయకులు సుదర్శన్ ప్రసాద్ తివారీ(Sudarshan Prasad Tiwari) పేర్కొన్నారు. గురువారం నాంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు టికెట్ అడగలేదని, ఈసారి తాను పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నానని, ఎంపీ ఎన్నికలు జాతీయ స్థాయి అంశాలు ప్రాధాన్యం ఇస్తుండడంతో తాను అన్ని వర్గాల ఆశిస్సులతో విజయం సాధిస్తానని తివారీ ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - Dec 29 , 2023 | 01:07 PM