KTR: కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉంది: కేటీఆర్
ABN, First Publish Date - 2023-11-10T17:21:39+05:30
కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉందని, కాంగ్రెస్.. బీజేపీ స్ఫూర్తితో మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్, BJP ఆలోచనలు ఒక్కటే అని కేటీఆర్ ఆరోపించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉందని, కాంగ్రెస్.. బీజేపీ స్ఫూర్తితో మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినట్టుందని ఎద్దేవా చేశారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్, BJP ఆలోచనలు ఒక్కటే అని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ గతంలో కూడా చాలా తప్పుడు వాగ్దానాలు చేసిందని కేటీఆర్ మండిపడ్డారు.
"కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉంది. కాంగ్రెస్.. బీజేపీ స్ఫూర్తితో మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినట్టుంది. మైనారిటీల విషయంలో కాంగ్రెస్, BJP ఆలోచనలు ఒక్కటే. కాంగ్రెస్ గతంలో కూడా చాలా తప్పుడు వాగ్దానాలు చేసింది. బీసీలు, ముస్లింలకు మధ్య గొడవలు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. 2004-14 మధ్య కాంగ్రెస్ మైనార్టీలకు ఏం చేసింది. పదేళ్లలో కాంగ్రెస్ మైనార్టీల కోసం రూ.930 కోట్లు ఖర్చు చేస్తే గత పదేళ్లలో BRS ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేసింది." అని కేటీఆర్ అన్నారు.
Updated Date - 2023-11-10T17:22:51+05:30 IST