ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nagpur Test: భారత గడ్డపై ఆస్ట్రేలియా చెత్త రికార్డు!

ABN, First Publish Date - 2023-02-11T16:38:48+05:30

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)లో భాగంగా నాగ్‌పూర్‌(Nagpur)లో టీమిండియా(Team India)తో జరిగిన తొలి టెస్టులో దారుణంగా ఓడిన ఆస్ట్రేలియా(Australia) భారత గడ్డపై ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. అశ్విన్(Ravichandran Ashwin) స్పిన్ మాయాజాలానికి బెంబేలెత్తిన ఆసీస్ బ్యాటర్లు వరుపెట్టి పెవిలియన్ చేరారు. ఫలితంగా 91 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. భారత గడ్డపై ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోరు. ఈ టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. అలాగే, ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం ఇది ఐదోసారి. 1997/98లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 219 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం.

నాగ్‌పూర్‌ టెస్టు(Nagpur Test)లో భారత్ సమష్టిగా రాణించి అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో చక్కని ప్రదర్శన కనబరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 177 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 400 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (120) సెంచరీతో రాణించగా, రవీంద్ర జడేజా 70, అక్షర్ పటేల్ 84, మహమ్మద్ షమీ 37 పరుగులు చేశారు. కంగారూ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల దెబ్బకు చిగురుటాకులా వణికింది. ముఖ్యంగా అశ్విన్ దెబ్బకు వికెట్లను టపటపా రాల్చుకుంది. ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన అశ్విన్(Ashwin) ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూల్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసుకున్నాడు. షమీకి రెండు వికెట్లు దక్కాయి.

భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ఢిల్లీలో ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతుంది. మార్చి 1న జరగనున్న మూడో టెస్టుకు ధర్మశాల, 9 నుంచి జరగనున్న చివరిదైన నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తాయి. అనంతరం మార్చి 17 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.

Updated Date - 2023-02-11T16:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising