Home » Australia
ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్లో భాగంగా సిడ్నీలో జరిగే టెస్టే తనకు ఆఖరు మ్యాచ్ కానుందని వెల్లడించాడు. ఖవాజా తన కెరీర్లో ఇప్పటివరకు 87 టెస్ట్లు, 40 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.
టీ20 వరల్డ్ కప్ -2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ టోర్నీని భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో ఆయా దేశాలు టీ20 వరల్డ్ కప్ ఆడే తమ జట్టును ప్రకటిస్తున్నాయి. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు కూడా తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలో.. 15 మంది సభ్యులతో కూడిన తమ బృందాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ క్రిస్ లిన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్ 2025-26)లో 4000 పరుగుల మైలురాయిని తాకిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బ్రిస్బేన్ హీట్తో నిన్న (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు . అతడు అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామీన్ మార్టిన్ కోమాలోకి వెళ్లినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమయంగా ఉంది. కాగా మార్టిన్ ఆస్ట్రేలియా 1999, 2003 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2003 ఫైనల్లో భారత్పై విరిగిన వేలితో అజేయంగా 88 పరుగులు చేశాడు.
యాషెస్ సిరీస్లో భాగంగా మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో తలపడ్డాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్.. ఆసీస్ గడ్డపై ఘన విజయం సాధించింది. ఈ ఆట రెండు రోజుల్లోనే ముగియడం గమనార్హం.
నాలుగో టెస్టులో మ్యాచ్ ప్రారంభంలో ఇంగ్లాండ్ పేసర్లు గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ చెలరేగడంతో ఆసీస్ జట్టు 152 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది.
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్ట్ ఆడుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఇంగ్లండ్ గెలుపుకి ఇంకా 228 పరుగులు కావాలి.
యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మూడో టెస్టులో తలపడుతున్నాయి. ఓవర్నైట్ 213/8 స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ 286 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది.
ఉగ్రవాది సాజిద్కు హైదరాబాద్తో లింకులేంటి.. అన్నదానిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా సాజిద్ సంబంధీకులను పోలీసులు విచారిస్తున్నారు. ఆయన తండ్రి, ఆయన సోదరుడు వైద్యుడుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజు ఆటలో డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) వివాదం చోటుచేసుకుంది. దీనిపై ఐసీసీ స్పందించింది. అడిలైడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వికెట్కీపర్ అలెక్స్ క్యారీకి సంబంధించిన డీఆర్ఎస్ విషయంలో సాంకేతిక లోపం జరిగిందని ఐసీసీ అంగీకరించింది.