Home » Ravichandran Ashwin
టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా విభాగంలో పలువురికి పద్మ అవార్డులు వరించాయి. హాకీ, క్రికెట్, ఫుట్బాల్, పారా -ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది.
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డేల్లో కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ నేపథ్యంలో జడేజా గురించి అతడి మాజీ సహచరుడు, టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ పరంగా జడ్డూకు పలు కీలక సూచనలు చేశాడు.
అండర్ 19 ప్రపంచ కప్నకు ముందు టీమిండియా యువ ఆటగాళ్లు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో తలపడుతున్నారు. ఇందులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్.. వైభవ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. 14 ఏళ్ల వయసులోనే ఈ విధ్వంసం ఏంటని ఆశ్చర్యపోయాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఐసీసీ తీసుకున్న నిర్ణయాల వల్ల టీ20 ప్రపంచ కప్ను ఎవరూ చూడరని తీవ్ర విమర్శలు గుప్పించాడు.
ఈ సంవత్సారికి గానూ తన దృష్టిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన బౌలర్, బ్యాటర్ ఎవరో టీమిండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ చెప్పేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలర్ ఆఫ్ ది ఇయర్ అని ప్రశంసించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును సెలక్టర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు. టీమిండియాలోకి ఇషాన్ రీఎంట్రీపై భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు.
టీమిండియా టీ20 వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనుబరుస్తున్నాడు. ఇదే తీరు కొనసాగితే జట్టులో స్థానం కోల్పోతాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ స్నిన్నర్ అశ్విన్ స్పందించాడు.
దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో భాగంగా తమిళనాడు జట్టు సోమవారం సౌరాష్ట్ర తలపడింది. ఈ మ్యాచ్ లో తమిళనాడు మూడు వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై విజయం సాధించింది. ఇక మ్యాచ్ అనంతరం సన్నీ లియోన్ ఫొటోను టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. నెటిజన్లను షాక్ కు గురి చేశాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ ప్రస్తుతం వన్డే క్రికెట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. తాజాగా, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రో-కోపై ప్రశంసలు కురిపించాడు.