Nara Lokesh: యువగళానికి అడ్డొస్తే సైకో సైన్యానికి సినిమా చూపిస్తాం
ABN, First Publish Date - 2023-05-20T19:32:53+05:30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) బనగానపల్లె బహిరంగ సభలో టీడీపీ (TDP) యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.
నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) బనగానపల్లె బహిరంగ సభలో టీడీపీ (TDP) యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు. మనది సైకిల్ ప్రభుత్వం.. జగన్ ది సైకో ప్రభుత్వమని, టీడీపీ హయాంలో నీళ్లు... జగన్ హయాంలో కన్నీళ్లు వచ్చాయని మండిపడ్డారు. యువగళానికి అడ్డొస్తే సైకో సైన్యానికి సినిమా చూపిస్తామని, జగన్ నిస్సిగ్గుగా పేదవాడినని పబ్లిసిటీ చేసుకుంటున్నారని విమర్శించారు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా?, లక్ష విలువచేసే చెప్పులు వేసుకునే వాడు పేదవాడా? అని విమర్శించారు. తమ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్న ఏ ఒక్కరిని వదిలి పెట్టమని, సాగానిస్తే పాదయాత్ర... అడ్డుకుంటే దండయాత్ర అని నారా లోకేష్ హెచ్చరించారు. వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన పవిత్ర నేల బనగానపల్లె, యువగళం..మనగళం..ప్రజాబలం అని లోకేష్ అన్నారు.
Updated Date - 2023-05-20T19:35:45+05:30 IST