ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP MLAs: తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు

ABN, First Publish Date - 2023-03-20T20:02:20+05:30

అసెంబ్లీలో తమపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని తుళ్లూరు పోలీసు స్టేషన్‌ (Tullur police station)లో టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: అసెంబ్లీలో తమపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని తుళ్లూరు పోలీసు స్టేషన్‌ (Tullur police station)లో టీడీపీ ఎమ్మెల్యేలు (TDP MLAs) ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, వెల్లంపల్లి, ఎలిజా, కారుమూరుపై టీడీపీ ఎమ్మెల్యేలు స్వామి, బుచ్చయ్య చౌదరి ఫిర్యాదు చేశారని టీడీపీ నేతలు చెప్పారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై విచారణ జరపాలని, ఎడిట్‌ చేయని ఫుటేజీని పరిశీలించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పోలీసులకు తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామిపై ( TDP MLA Dola Veeranjaneya Swamy) దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలను (YCP MLAs) సభలో అడుగు పెట్టనివ్వమని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటన ఆగ్రహం తెప్పిస్తుందని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సందర్భంలోనూ సభలో ఎమ్మెల్యేలను కొట్టలేదని చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ చరిత్రలో ఇది ఓ చీకటి రోజు అని, అసెంబ్లీలో దాడి ఘటనలు గతంలో జరగలేదని, స్వామిపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు.. టీడీపీనే దాడి చేసిందని అరోపిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద మనిషి బుచ్చయ్యచౌదరి మీదకు వస్తారా..? అని, స్వామి మీద చేయి వేయకుండా చూసుకోలేకపోయామనే బాధ తనకెప్పుడూ ఉంటుందని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2023-03-20T20:08:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising