ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rain: రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

ABN, First Publish Date - 2023-05-21T19:27:40+05:30

పడమర దిశ నుంచి రాష్ట్రంపైకి పొడిగాలులు వీస్తున్నాయి. దీనికితోడు విదర్భ నుంచి మరాఠ్వాడ, కర్ణాటక (Karnataka) మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: పడమర దిశ నుంచి రాష్ట్రంపైకి పొడిగాలులు వీస్తున్నాయి. దీనికితోడు విదర్భ నుంచి మరాఠ్వాడ, కర్ణాటక (Karnataka) మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తేమగాలులు రాష్ట్రంపైకి వీశాయి. పొడి, తేమగాలుల ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో రాయలసీమలో నంద్యాల, సత్యసాయి, చిత్తూరు, కడప (Chittoor Kadapa), కర్నూలు, కోస్తాలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులు, ఉరుములతో వర్షాలు కురిశాయి. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ (Rayalaseema)లో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఆదివారం కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఎండతీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు అంత కంటే ఎక్కువగా నమోదయ్యాయి. కడపలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజులు ఎండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2023-05-21T19:27:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising