ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay: ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ ఎంట్రీ

ABN, First Publish Date - 2023-08-18T14:42:46+05:30

అమరావతి: ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. జగన్ ప్రభుత్వంపై అమీతుమీకి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 21న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ అమరావతికి రానున్నారు.

అమరావతి: ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ (Bandi Sanjay) ఎంట్రీ ఇవ్వనున్నారు. జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై అమీతుమీకి బీజేపీ (BJP) సిద్ధమైంది. ఈ నెల 21న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ అమరావతి (Amaravati)కి రానున్నారు. ఆయన సేవలను ఏపీలో మరింత వాడుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఏపీలో ఓటరు నమోదు (Voter Registration) ప్రక్రియను బండి సంజయ్ సమీక్షించనున్నారు. అలాగే తెలంగాణ (Telangana)తోపాటు ఏపీ (AP), మహారాష్ట్ర (Maharastra), గోవా (Goa), ఒడిషా (Odisha) ఐదు రాష్ట్రాల బాధ్యతలు ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత బండి సంజయ్ ఈ నెల 21న విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు హీటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్షుడిగా మార్చిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. ఈ నేపథ్యంలో బండి సేవలను తెలంగాణతోపాటు ఏపీలో కూడా ఉపయోగించుకోవాలని హైకమాండ్ నిర్ణయించింది. మొదటిసారిగా బండి సంజయ్ ఏపీకి వెళుతున్న నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2023-08-18T14:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising