ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kollu Ravindra: వైసీపీ నేతలను సీఎం బందిపోటు దొంగల్లా మార్చారు...

ABN, First Publish Date - 2023-04-26T17:29:21+05:30

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర (Kollu Ravindra) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర (Kollu Ravindra) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులను సీఎం జగన్ (CM Jagan) బందిపోటు దొంగల్లా మార్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తన అక్రమార్జన కోసం విద్యార్థులను గంజాయికి బానిసలుగా మార్చారని విమర్శించారు. విద్యార్థులను సత్యనాదెండ్ల (Satyanadendla)గా మారుస్తానంటూనే గంజాయి (Marijuana)కి బానిసలుగా మార్చారన్నారు. నాలుగు ఏళ్లలో 2 వందల మంది విద్యార్థులను మాత్రమే విదేశీ విద్యకు పంపడం సిగ్గుచేటన్నారు.

విదేశీ చదువు కోసం వెళ్లిన వారి బకాయిలను జగన్ ప్రభుత్వం (Jagan Govt.) చెల్లించలేదని, విద్యార్థుల బతుకులు బుగ్గిపాలు చేశారని కొల్లు రవీంధ్ర మండిపడ్డారు. రాష్ట్రంలోని భవిష్యత్ తరాల పరిస్థితి అగమ్య గోచరంలోకి నెట్టారన్నారు. ముఖ్యమంత్రి బటన్‌లు నొక్కి రాష్ట్రాభివృద్ధిని దిగజార్చారని దుయ్యబట్టారు. సీఎంను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యార్థుల తరపున పోరాడటానికి టీడీపీ సిద్ధంగా ఉందని, రాష్ట్రానికి మళ్లీ మంచిరోజులు రావాలని కొల్లు రవీంధ్ర ఆకాంక్షించారు.

Updated Date - 2023-04-26T17:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising