తిరుమలలో నేడు శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..
ABN, First Publish Date - 2023-03-28T08:17:04+05:30
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
Tirupati : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న (సోమవారం) తిరుమల శ్రీవారిని 67,886 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.56 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న 29,107 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
Updated Date - 2023-03-28T08:17:04+05:30 IST