AP NEWS: మద్యం మత్తులో ఇంటిని ఢీకొట్టిన లారీ డ్రైవర్
ABN, Publish Date - Dec 17 , 2023 | 06:16 PM
మద్యం మత్తరులో అతివేగంతో ఓ లారీ డ్రైవర్ ఇంటిపైకి దూసుకు వెళ్లాడు. ఈ ఘటన కుప్పంలోని క్రిష్ణగిరి జాతీయ రహదారి గుండుశెట్టిపల్లి దగ్గర జరిగింది. ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో కుటుంబం సభ్యులు ఊపిరిపించుకున్నారు.
చిత్తూరు : మద్యం మత్తరులో అతివేగంతో ఓ లారీ డ్రైవర్ ఇంటిపైకి దూసుకు వెళ్లాడు. ఈ ఘటన కుప్పంలోని క్రిష్ణగిరి జాతీయ రహదారి గుండుశెట్టిపల్లి దగ్గర జరిగింది. ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో కుటుంబం సభ్యులు ఊపిరిపించుకున్నారు. ఇల్లు కూలిపోవడంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై పడ్డారు. రోజువారి కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో లారీ డ్రైవర్ ఉండడంతోనే ఈఘటన జరిగిందని గ్రామస్తులు చెప్పారు. గాయపడ్డ డ్రైవర్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Updated Date - Dec 17 , 2023 | 06:16 PM