ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP Colors: కుర్చీలే కాదు.. జాతీయ జెండా పోల్‌కు వైసీపీ రంగులు.. ఢిల్లీ ఏపీభవన్‌లో అధికారుల తీరు ఇదీ..

ABN, First Publish Date - 2023-11-01T10:52:35+05:30

దేశరాజధాని ఢిల్లీలోని వైసీపీ పార్టీ రంగుల పిచ్చి వదలలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇది అధికారిక కార్యక్రమమా లేక వైసీపీ పార్టీ కార్యక్రమమా అన్న రీతిలో అక్కడి అలంకరణ ఉంది.

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని వైసీపీ పార్టీ రంగుల (YCP Party Colors) పిచ్చి వదలలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో (Delhi AP Bhavan) ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇది అధికారిక కార్యక్రమమా లేక వైసీపీ పార్టీ కార్యక్రమమా అన్న రీతిలో అక్కడి అలంకరణ ఉంది. అధికారిక కార్యక్రమంలో వైసీపీ పార్టీ మూడు రంగుల ఫ్లెక్సీలు బ్యానర్లు బెలూన్స్ ఏర్పాటు చేశారు. చివరకు కూర్చునే కుర్చీలకు కూడా వైసీపీ రంగులతో కూడిన గుడ్డలు కట్టిన వైనం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదంతా చూస్తుంటే అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం ఏపీ భవన్ అధికారుల పాకులాడినట్లు తెలుస్తోంది. ఏపీభవన్ పరిసరాలు కార్యక్రమం జరిగే ఆడిటోరియం మొత్తాన్ని వైసీపీ రంగులతో పోలిన కర్టెన్స్, ఫ్లెక్సీలు బెలూన్లతో అలంకరించారు. జాతీయ జెండాను ఎగరవేసే పోల్‌కు కూడా జాతీయ జెండాతో పాటు వైసీపీ రంగులు పోలిన బెలూన్లను అధికారులు అలంకరించారు. అధికారిక కార్యక్రమంలో పార్టీ రంగులు, జెండాలు ఏంటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

Updated Date - 2023-11-01T10:52:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising