‘కల్యాణలక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:35 AM
ప్రభు త్వం నిరుపేదలకు అందిస్తున్న కల్యాణలక్ష్మి పథకాన్ని స ద్వినియోగం చేసుకోవాలని చండూరు ఆర్డీవో శ్రీదేవి అ న్నారు.
‘కల్యాణలక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలి
చండూరు ఆర్డీవో శ్రీదేవి
మర్రిగూడ, నాంపల్లి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వం నిరుపేదలకు అందిస్తున్న కల్యాణలక్ష్మి పథకాన్ని స ద్వినియోగం చేసుకోవాలని చండూరు ఆర్డీవో శ్రీదేవి అ న్నారు. మర్రిగూడ తహసీల్దార్ కార్యాలయంలో గురువా రం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఆమె పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉండేందుకే చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలో 91 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో డీటీ తారకరామన, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివా్సనాయక్, అయితగోని వెంకటయ్య, పార్టీ మండల అధ్యక్షుడు రాందాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, వెంకటంపేట బాలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నమనేని రవీందర్రావు, నక్క శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నాంపల్లిలో ప్రభుత్వం నుంచి మంజూరైన 78 కల్యాణలక్ష్మి చెక్కులను తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దేవసింగ్ లబ్ధిదారులకు అందజేశారు. ఆర్ఐ దయాకర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎరెడ్ల రఘుపతిరెడ్డి, పూల వెంకటయ్య, పానగంటి వెంకటయ్య, నేతాళ్ల కొండల్, గాదెపాక రాజు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Updated Date - Jan 10 , 2025 | 12:35 AM