సమస్యలు పరిష్కరించండి
ABN, Publish Date - Feb 27 , 2025 | 01:32 AM
కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధ వారం అగ్రికల్చరల్ కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేశారు. కళాశాలలో ఉపన్యాసకులు సరిగా లేకపో వడంతో పాటు తరగతి గుదులు సరిగా లేవని, మరు గుదొడ్లు పూర్తిగా చెడిపోయి ఉన్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కోరుట్ల వేములవాడ రహదారిపై నిరసన తెలిపారు.
కోరుట్ల, ఫిబ్రవరి 24 (ఆంద్రజ్యోతి) : కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధ వారం అగ్రికల్చరల్ కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేశారు. కళాశాలలో ఉపన్యాసకులు సరిగా లేకపో వడంతో పాటు తరగతి గుదులు సరిగా లేవని, మరు గుదొడ్లు పూర్తిగా చెడిపోయి ఉన్నాయని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. కోరుట్ల వేములవాడ రహదారిపై నిరసన తెలిపారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని చేరుకుని ఆందోళన విరమిం పజేశారు. అనంతరం కళాశాల గేట్ వద్ద విద్యార్థులు మరోమారు నిరసనకు దిగారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరిస్తామని తెలుపడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.
భారీగా నిలిచిపోయిన వాహనాలు
కోరుట్ల వేములవాడ రోడ్డుపై విద్యార్థులు రాస్తా రోకో చేయడంతో పండగపూట ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజన్న దర్శనానికి వెళ్తున్న ప్రయాణికులు రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడకు భారీ సంఖ్యలో భక్తులు ఆర్టీసీ బస్సులు, వాహనాల్లో వెళ్తుండగా రాస్తా రోకోతో నిలిచిపోయాయి. సుమారు గంట పాటు విద్యార్థులు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
Updated Date - Feb 27 , 2025 | 01:32 AM