గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
ABN, Publish Date - Feb 04 , 2025 | 12:00 AM
మండల పరిధిలోని కోకట్ కాగ్నా వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు యాలాల ఎస్ఐ గిరి తెలిపారు.
యాలాల, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కోకట్ కాగ్నా వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు యాలాల ఎస్ఐ గిరి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోకట్కాగ్నా వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి ఒంటిపై నల్లటి ప్యాంటు, సుమారు 35నుంచి 40ఏళ్ల వయస్సుగల వ్యక్తి కాగ్నా నది నీటిలో పడి మృతిచెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి శవ పరీక్ష నిమిత్తం తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ గిరి తెలిపారు.
Updated Date - Feb 04 , 2025 | 12:00 AM