ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నాకు తరలిరావాలి
ABN, Publish Date - Mar 06 , 2025 | 01:03 AM
గ్రామపంచాయతీ కార్మికుల సమస్య లను ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వం విప్, వేము లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీసుకెళ్లి న్యాయం చేయాలని సీఐటీయూ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల రూరల్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ కార్మికుల సమస్య లను ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వం విప్, వేము లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీసుకెళ్లి న్యాయం చేయాలని సీఐటీయూ తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు జీపీ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడాలంటూ గురు వారం వేములవాడలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటి ఎదుట ధర్నాను చేపట్టను న్నట్లు, దీనికి జిల్లాలోని కార్మికులందరు హాజరుకావాలని కోరారు. జిల్లా అధ్యక్షు డు మల్యాల నర్సయ్య, వర్కోలు మల్లయ్య, బూర శ్రీనివాస్గౌడ్, అక్కల అంజాగౌ డ్, లోకిని శ్రీనివాస్, సందేల మహేష్, కంసాని రవీందర్ పాల్గొన్నారు.
Updated Date - Mar 06 , 2025 | 01:03 AM