వాహనదారులు నిబంధనలు పాటించాలి
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:38 AM
వాహనదారులు ఆర్టీఏ నియమ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడు పడాల రాహుల్ అన్నారు.
కరీంనగర్ క్రైం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): వాహనదారులు ఆర్టీఏ నియమ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యుడు పడాల రాహుల్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా తిమ్మాపూర్లోని ఆర్టీవో కార్యాలయంలోని ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రాహుల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పడాల రాహుల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తాయని, వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అనంతరం వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవి కుమార్, ఏఎంవీఐ హరిత, రిటైర్డ్ డీటీఓ జైపాల్ (టైన్రింగ్ ) పాల్గొన్నారు.
Updated Date - Jan 21 , 2025 | 12:38 AM