కుక్కల దాడిలో 38 జీవాలు మృతి
ABN, Publish Date - Jan 01 , 2025 | 12:26 AM
కుక్కలు దాడి చేసిన ఘటనలో 38 జీవాలు మృతి చెందాయి.
నిడమనూరు, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కుక్కలు దాడి చేసిన ఘటనలో 38 జీవాలు మృతి చెందాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ఊ ట్కూరు గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఎల్లబోయిన లింగస్వామి గొర్రెలు, మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి తన జీవాలను మందలో ఉంచగా కుక్కలు దాడి చేయగా మొత్తం 38 జీవాలు మృత్యువాతకు గురయ్యాయి. సుమారు రూ.3 లక్షల విలువ కలిగిన జీవాలు మృతి చెందినట్లు బాధితుడు లబోదిబోమంటున్నాడు. కుక్కల దాడిలో జీవా లు మృతి చెందినందున బాధితున్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ నర్సింగు విజయ్కుమార్ కోరారు.
Updated Date - Jan 01 , 2025 | 12:26 AM