ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

క్వార్టర్స్‌కు కిరణ్‌, సింధు

ABN, Publish Date - Jan 17 , 2025 | 05:29 AM

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, యువ ఆటగాడు కిరణ్‌ జార్జ్‌ సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌లో అదరగొడుతున్నారు. సింగిల్స్‌లో వీరు క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఇక, పురుషుల డబుల్స్‌లో...

  • డబుల్స్‌లో సాత్విక్‌ జోడీ

  • ఇండియా ఓపెన్‌

న్యూఢిల్లీ: స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, యువ ఆటగాడు కిరణ్‌ జార్జ్‌ సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌లో అదరగొడుతున్నారు. సింగిల్స్‌లో వీరు క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఇక, పురుషుల డబుల్స్‌లో భారత ఏస్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి కూడా ప్రీక్వార్టర్స్‌ను అధిగమించారు. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో సింధు 21-15, 21-13తో మనామి సుయిజు (జపా న్‌)ను చిత్తుచేయగా.. కిరణ్‌ 22-20, 21-13తో అలెక్స్‌ లేనియర్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచాడు. హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్‌ పోరులో 2022 విజేత సాత్విక్‌/చిరాగ్‌ ద్వయం 20-22, 21-14, 21-16తో జపాన్‌ జంట మిత్సుహషి/ఒకమురను ఓడించింది. మహిళల డబుల్స్‌లో భారత జోడీ అశ్వినీ పొన్నప్ప/తనీషా 9-21, 21-23తో జపాన్‌ ద్వయం మత్సుమొటొ/ఫకషిమ చేతిలో, అశ్వినీ భట్‌/శిఖా గౌతమ్‌ జంట 7-21, 10-21తో చైనా జోడీ యాన్‌ లి/గ్జూ లూవో చేతిలో ఓడారు. క్వార్టర్స్‌లో పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గ్రెగోరియాతో సింధు, హాంగ్‌ యాంగ్‌ (చైనా)తో కిరణ్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు.

Updated Date - Jan 17 , 2025 | 05:29 AM