ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఒలింపిక్‌ విజేతకు షాకిచ్చారు

ABN, Publish Date - Feb 26 , 2025 | 05:23 AM

భారత మహిళల హాకీ జట్టు ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో అద్భుత విజయం సాధించింది. మంగళవారం జరిగిన పోరులో పారిస్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌, ప్రపంచ నెంబర్‌వన్‌ నెదర్లాండ్స్‌కు షాకిచ్చింది...

భారత హాకీ అమ్మాయిల అద్భుత విజయం

భువనేశ్వర్‌: భారత మహిళల హాకీ జట్టు ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో అద్భుత విజయం సాధించింది. మంగళవారం జరిగిన పోరులో పారిస్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌, ప్రపంచ నెంబర్‌వన్‌ నెదర్లాండ్స్‌కు షాకిచ్చింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 2-2 గోల్స్‌తో నిలిచాయి. దీంతో ఫలితం తేల్చే షూటౌట్‌లో దీపిక, ముంతాజ్‌ చెరో గోల్‌ సాధించడంతో భారత్‌ 2-1తో డిఫెండింగ్‌ చాంప్‌ నెదర్లాండ్స్‌ను చిత్తుచేసింది. షూటౌట్‌లో డచ్‌ తరఫున ఏకైక గోల్‌ను మార్జిన్‌ వీన్‌ చేసింది. వెటరన్‌ గోల్‌కీపర్‌ సవిత పూనియా ప్రత్యర్థి నాలుగు గోల్స్‌ ప్రయత్నాలను సమర్ధ వంతంగా అడ్డుకొని భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించింది.

హెచ్‌ఐ నజరానా: ఒలింపిక్‌ విజేత నెదర్లాండ్స్‌ను ఓడించిన భారత . జట్టులోని ప్రతి సభ్యురాలికి రూ. లక్ష చొప్పున, సహాయ సిబ్బందికి తలో రూ. 50 వేలు రివార్డు ఇవ్వనున్నట్టు హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది.


ఇవీ చదవండి:

టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు.. సెమీస్‌పై సస్పెన్స్ కంటిన్యూ

భార్య గురించి షాకింగ్ విషయం చెప్పిన చాహల్..

భారత్ విజయంపై పాక్ వక్రభాష్యం.. విజయానికి కారణం అదేనట..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2025 | 05:23 AM